యాదగిరిగుట్ట, మార్చి 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి కల్యాణోత్సవ సేవను అర్చకులు అత్యంత వైభవం గా నిర్వహించారు. బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లను ముస్తాబు చేసి గజవాహనంపై ఆలయ తిరుమాడ వీధు ల్లో ఊరేగించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపి స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని నిర్వహించారు.
దర్బార్ సేవ, ఉత్సవమూర్తులకు తిరువీధి సేవ వైభవంగా జరిగింది. స్వామివారికి తులసీ సహస్ర నామార్చన, ఆమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 17 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.19,95,069 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.