చొప్పదండి, మే 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పార్టీలకతీతంగా అమలవుతున్నది. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూస భూమయ్య సతీమణి లక్ష్మి, మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీపాద రవీందర్ సతీమణి లలితకు కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు సారెను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు లక్ష్మి-భూమయ్య దంపతులు టవల్ కప్పి, చక్కెర కుడుకలు పోసి ఆత్మీయతను చాటుకొన్నారు. గ్రామానికి చెందిన 17 మందికి ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.