ముకరంపుర, సెప్టెంబర్ 9: ప్రజాకవి కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కాళోజీ జయంతి సందర్భంగా శనివారం కరీంనగరంలోని 18వ డివిజన్ రేకుర్తిలోగల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ తెలంగాణ భాషా సాహిత్యానికి చేసిన సేవలను కొనియాడారు. తన రచనల ద్వారా ప్రజాకవిగా గుర్తింపు పొంది, ప్రజల్లో చైతన్యం నింపారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు, కార్పొరేటర్లు, అల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ నరేందర్రెడ్డి, వాల్యూ హోమ్స్ అధ్యక్షుడు రమణారెడ్డి పాల్గ్గొన్నారు.