హైదరాబాద్ : ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ను ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన ఎంపికపై డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరగోపాల్తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి హరగోపాల్తో తెలంగాణలో ఎన్నో కనుమరుగైన చారిత్రక ప్రదేశాలను సందర్శించి, వాటిని బహిర్గతం చేసినట్లు తెలిపారు.
హరగోపాల్ చరిత్ర పరిశోధన వైపు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించి.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిక్షిప్తమైన ఎన్నో శాసనాలు, చిలాఫలకాలు, రాతి చిత్రాలు, పునరావస్తు ప్రదేశాలు, ప్రాచీన బౌద్ధ జైన క్షేత్రాల చరిత్రను తవ్వితీస్తూ.. చరిత్ర, శాసన పరిశోధకుడిగా కనుమరుగైన చరిత్రను వెలికి తీస్తూ.. తెలంగాణలో కొత్త చరిత్రను పరిచయం చేస్తున్న గొప్ప పరిశోధకుడని కొనియాడారు. అవార్డుకు ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు.