Pargi | వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని కాళ్లాపూర్ రైతులు చేస్తున్న ధర్నాకు పర్మిషన్ నిరాకరించడంతో అక్కడ ఉద్రిక్తత చెలరేగింది.
ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని చేస్తున్న రిలే దీక్షలకు అనుమతి ఇవ్వాలని వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామ రైతులు పరిగి పోలీస్ స్టేషన్ను మెట్లు ఎక్కారు. కానీ ఈ దీక్షలకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వస్తుండటంతో అనుమతి నిరాకరించారు. దీంతో పోలీస్ స్టేషన్ బయటే పలువురు రైతులు బైఠాయించారు. ఈ క్రమంలో మీ కాళ్లు మొక్కుతాం.. పర్మిషన్ ఇవ్వండి అంటూ పోలీసుల కాళ్ల మీద పడి మహిళా రైతులు వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసులు అనుమతిని నిరాకరిండంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ కాళ్ళు మొక్కుతం పర్మిషన్ ఇవ్వండి అంటూ పోలీసుల కాళ్ళు మొక్కిన మహిళా రైతులు
అయినా అనుమతి నిరాకరించిన పోలీసులు
పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాల రైతుల భూమిని గుంజుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న రిలే దీక్ష వద్దకు వస్తున్న హరీష్… https://t.co/oWz7FwBAUt pic.twitter.com/2kqv16hmPP
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026
శాంతియుతంగా నిరసన తెలిపితే పర్మిషన్ ఎందుకు ఇవ్వరంటూ పోలీసులను రైతులు నిలదీశారు. పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు రైతులను లోపలే ఉంచి పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేశారు. దీంతో స్టేషన్ బయట ఉన్న రైతులు గేటు ఎక్కి మరీ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పరిగి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బ్రేకింగ్ న్యూస్
మద్దతుగా హరీష్ రావు వస్తున్నాడని అనుమతి ఇవ్వకుండా రైతులను పరిగి పోలీస్ స్టేషన్లో పెట్టిన పోలీసులు
పోలీస్ స్టేషన్ ముందు కాళ్లాపూర్ రైతులు, గ్రామస్తుల ఆందోళన
రేవంత్ రెడ్డి భూ దాహానికి తమ 1200 ఎకరాలు పోతున్నాయని రైతులు చేస్తున్న రైతుల రిలే నిరవదిక దీక్షకు… pic.twitter.com/iPUtTKr0uF
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026