హనుమకొండ చౌరస్తా, జనవరి 7: గుండెపోటుతో కేయూ ఉద్యోగి మృతి చెందాడు. కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు చేసిన పనికి బిల్లులు చెల్లించకపోవడంతో మానసికంగా మనోవేదనకు గురై మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. కేయూ హిస్టరీ, టూరిజం విభాగంలో లమ్సమ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కాలె మధుసూదన్ (49) వర్సిటీ ఐడీ కార్డులు, ఫ్లెక్సీలు, నేమ్ప్లేట్స్, బోర్డులు, ప్రింటింగ్కు సంబంధించిన రామెటీరియల్స్ తీసుకువచ్చి ఇంటి వద్ద పనిచేస్తుంటాడు.
గతంలో న్యాక్ బృందం పర్యటన సందర్భంగా న్యాక్ పర్చేజింగ్ కమిటీ చైర్మన్, ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ మంచాల సదానందం రూ.20 లక్షల విలువైన పనులు చేయించారు. ఆ బిల్లులు చెల్లించలేదు. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. దీంతో ఒత్తిడికి గురై ఆదివారం గుండెనొప్పితో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపా రు. మృతదేహాన్ని కేయూ పరిపాలనా భవనం ఎదుట ఉంచి నిరసన తెలిపారు. సోమవారంలోగా డబ్బులు చెల్లిస్తామని వీసీ రమేశ్ హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తీసుకెళ్లారు.