Kadiam Srihari | హైదరాబాద్ : బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ఈ సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నట్లు ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. నాలుగు రోజులే సభ నిర్వహిస్తామన్నారు. కనీసం 12 రోజులైనా సభ నిర్వహించాలని కోరినట్లు పేర్కొన్నారు. అవసరమైతే 13న మరోసారి బీఏసీ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు తెలిపారు. త్వరగా బడ్జెట్ ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం లేకుండా పోతుందని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా రెచ్చిపోతున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో ఇచ్చిన 420 హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుందనే భయంతో సమావేశాలను త్వరగా ముగిస్తున్నారని కడియం పేర్కొన్నారు.