హైదరాబాద్ : కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్ట్ విషయంలో విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గోరంతను కొండంత చేయొద్దని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) హితవు పలికారు. ఓట్ ఆన్ బడ్జ్ట్పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అనేక రిజర్వాయర్లు వచ్చాయి. దానికి అనుబంధంగా ఎన్నో ప్రాజెక్ట్లు నిర్మించుకున్నాం.
నీటి నిల్వ నిల్వ సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలతో తెలంగాణలో పెద్ద ఎత్తున పంటలు పండుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పారు. మేడిగడ్డ(Medigadda barrage) పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డపై ప్రభుత్వం పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీని వెంటనే రిపేరు చేయాలన్నారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మరమ్మతులు చేసుకోవాలేగానే ప్రాజెక్టే సరి కాదన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు.