హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కడియం శ్రీహరి తన రాజకీయ భవిష్యత్తును తానే భూస్థాపితం చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మంగళవారం టీవీ9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఓడిపోయి ఇంటికాడ ఉన్న శ్రీహరికి ఉపముఖ్యమంత్రిని చేశానని గుర్తుచేశారు.
జవాబు: కడియం శ్రీహరికి డబ్బు లు ఇచ్చారా? లేదా? అనేది ఏ రాజకీయ పార్టీ చెప్పదు. ఇది పొలికటికల్ వ్యవహారం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. శ్రీహరి అనే వ్యక్తి ఓడిపోయి ఇంటికాడ ఉంటే.. నేనే పిలిచి ఆయనను ఎంపీగా గెలిపించిన. ఆయనతో ఇక్క డ అవసరం ఏర్పడిందని, ఆయన సీనియర్ అని, రాజీనామా చేయించి, మళ్లీ బై ఎలక్షన్లలో గెలిపించి, ఎమ్మెల్సీని చేసిన. ఇక్కడ ఉప ముఖ్యమంత్రిని చేశాను. ఒక రాజకీయ పార్టీ అంతకంటే ఎక్కువ ఏ పదవి ఇస్తదండి.
ఆయ ఖర్మ బాగా లేక వెళ్లిపోయిండు. రాజకీయంగా తనను తానే భూ స్థాపితం చేసుకున్నడు. వరంగల్లో తాను చచ్చి, ఇప్పుడు బీఆర్ఎస్ను బతికిచ్చిండు. మాకు లాభం జరిగింది. మీరు చూస్తరు వరంగల్ రిజల్ట్. నీ బిడ్డకు టికెట్ ఎట్లా వచ్చిందండి? ఆ అమ్మాయికి ఎం దుకు ఇచ్చిన? కడియం కూతురు అనే కదా? అప్పుడు నీకు స్వేచ్ఛ కనపడలే. పొద్దుతిరుగుడు పువ్వు లాగా పార్టీని విడిచి పెట్టి అధికారి పార్టీ వైపు వెళ్లారు.
జవాబు: బీఆర్ఎస్ నుంచి వెళ్లనవారు ఎంత మందండి. పిడికెడు మంది. బీఆర్ఎస్ ఒక మహాసముద్రం. వందల మంది ఎమ్మెల్యేలను, పదుల సంఖ్యలో ఎమ్మెల్సీలను, పదుల సంఖ్యలో ఎంపీలను, డజన్ల కొద్ది జడ్పీ చైర్మన్లను, డీసీసీబీ చైర్మన్లను, వేల సంఖ్యలో సర్పంచ్లను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సింగిల్ విండో చైర్మన్లను సృష్టించిన ఒక మహాసముద్రం బీఆర్ఎస్.