హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy )పై ఎంపీ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే(Kadiam Srihari) ఫైర్ అయ్యారు. విదేశాల్లో బీఆర్ఎస్పై అనుచితంగా మాట్లాడిన రేవంత్రెడ్డి తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్(Davos)లో రేవంత్రెడ్డి తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను బొంద పెడుతామన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
బీఆర్ఎస్ను బొంద పెట్టే మొనగాడు పుట్టలేదన్నారు. గతంలో కేటీఆర్ దావోస్ వెళ్లినప్పుడు కేటీఆర్ ఎంతో హుందాగా ప్రవర్తించారు. పెట్టుబడులు సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. దేశంలోనే రోల్ మోడల్ తెలంగాణాను అభివృద్ధి చేసింది కేసీఆరే. అలాంటి కేసీఆర్ని తూలనాడడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు.