నిర్మల్ : సాగు భూమిని పట్టా చేసేందుకు లంచం(Bribe) తీసుకుంటూ తహసీల్దార్ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..నిర్మల్ జిల్లా కడెం(Kadem Tehsildar) మండలంలోని కొత్త మద్దిపడగా గ్రామానికి చెందిన లశెట్టి రాజన్న అనే రైతుకు చెందిన వ్యవసాయ భూమి 35 గుంటలను పట్టా చేసేందుకు తహసీల్దార్ రాజేశ్వరి(Tehsildar )ని కలివారు. పట్టా చేయాలంటే రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
దీంతో చేసేదేమి లేక బాధితడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఒప్పందంలో భాగంగా నాయబ్ తహసీల్దార్కు రూ.9 వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తహసీల్దార్ రాజేశ్వరి ఆదేశం మేరకు తాను డబ్బులు తీసుకున్నట్టు నాయబ్ తహసీల్దార్ చిన్నయ్య తెలిపారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.