కడెం/బెల్లంపల్లిరూరల్, జనవరి 10: రైతు నుంచి లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. కొత్తమద్దిపడగకు చెందిన లసెట్టి రాజన్న తన పెద్దనాన్న పేరు మీద ఉన్న 35 గుంటల భూమిని తన తమ్ముడు లసెట్టి సురేశ్ పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలని దరఖాస్తు చేసుకోగా రూ.15 వేలు డిమాండ్ చేశారు. బుధవారం డీటీ చిన్నయ్య కు రూ.9 వేలు లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పంచాయతీరాజ్ ఏఈ పరంజ్యోతి, పంచాయతీ కార్యదర్శి వీరబాబు బుధవారం ఏసీబీ అధికారులకు దొరికారు. కాంట్రాక్టర్ రామగోని అశోక్గౌడ్ పెర్కపల్లిలో రూ.1.50 లక్షలతో క్రీడాప్రాంగణానికి మట్టి పనులు చేపట్టారు. బిల్లు కోసం మెజర్మెంట్ బుక్ చేయడానికి ఏఈతోపాటు పంచాయతీ కార్యదర్శి కాంట్రాక్టర్ను రూ.15 వేలు లంచం డి మాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లిలో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈ పరంజ్యోతి, కార్యదర్శి కే వీరబాబును రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.