హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే జోన్కు ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. రైల్వేస్టేషన్ల విభాగంలో హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్కు మొదటి బహుమతి కైవసం చేసుకున్నది. 2022లో ఇంధన పొదుపు కోసం అవలంబించిన విధానాలకు ఈ అవార్డులు ప్రకటించినట్టు గురువారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
డిసెంబర్ 14న న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అవార్డులను ప్రదానం చేస్తారని తెలిపారు. రైల్వేస్టేషన్ల జాబితాలో కాచిగూడ, ఏపీలోని ఆరు ఉన్నాయి.