KA Paul | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మర్యాదపూర్వకంగా సోమవారం ఉదయం కలిశారు. జనవరి 30వ తేదీన హైదరాబాద్లో జరిగే గ్లోబల్ పీస్ సదస్సుకు హాజరు కావాలని రేవంత్ రెడ్డిని పాల్ ఆహ్వానించారు.
ఇందుకు కావాల్సిన అనుమతులను మంజూరు చేయాల్సిందిగా పాల్ సీఎంను కోరారు. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని పాల్ తెలిపారు. ఈ ప్రపంచ శాంతి సదస్సుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు నాయకులను ఆహ్వానించినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. ఈ సదస్సుకు పలు దేశాల నుంచి వేల మంది హాజరవుతున్నట్లు పాల్ వెల్లడించారు.