హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధాని తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న(Bharat Ratna) ను ప్రకటించడంపై బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు(K. Kesha Rao) హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వండపట్ల దేశమంతా హర్షిస్తుందని పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కు అరుదైన గౌరవం దక్కింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా కేంద్రం భారత రత్న పురస్కారాన్ని శుక్రవారం ప్రకటించింది. దీంతో పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.