BRS Party | కొల్లాపూర్ : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు 20 మంది శుక్రవారం గులాబీ పార్టీ గూటికి చేరారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఎన్మన్బెట్లకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరగా.. వారందరికీ గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో చేరిన అందరికీ సముచిత గౌరవం, స్థానం ఉంటుందన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. అనంతరం పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హయాంలో కొనసాగుతున్న ప్రగతిశీల పరిపాలనకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.