హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నెల 4న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫలితాలను www.scclmines. comలో అందుబాటులో ఉంచినట్టు జేఎన్టీయూహెచ్ డైరెక్టర్ విజయ్కుమార్రెడ్డి, సింగరేణి సంస్థ డైరెక్టర్ (పర్సనల్) ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. 77,898 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 49,328 మంది అభ్యర్థులు అర్హత సాధించారని వెల్లడించారు. మూడు ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు సరిగ్గాలేకపోవడంతో వాటికి మార్కులు కలిపినట్టు పేర్కొన్నారు. మెరిట్, రిజర్వేషన్, స్థానికత ఆధారంగా ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాను రూపొందించి వారం రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.