హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): అద్భుత కళాసంపదతో భావితరాలకు గుర్తుండిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బీఆర్ అంబేద్కర్ సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం, అంబేద్కర్ విగ్రహం నిర్మాణాలపై విడివిడిగా కవితలు రాసి పంపాలని తెలంగాణ సాహిత్య అకాడమీ కోరింది. 25 లైన్లకు మించకుండా కవితలు రాసి ఈ నెల 31వ తేదీలోగా tsakademi.2017@ gmail.comకు మెయిల్ లేదా 9440233261 నంబర్కు వాట్సాప్ చేయాలని అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ విజ్ఞప్తి చేశారు.