హైదరాబాద్ : జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్రేప్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఐదుగురు మైనర్లతో పాటు ఏ1 సాదుద్దీన్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మైనర్లను అమ్నేషియా పబ్, కాన్సూ బేకరి ప్రాంతాలకు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ 36, 44లను పరిశీలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ కస్టడీ ఇవాళ్టితో ముగినుండగా.. పోలీసులు మరికొద్దిసేపట్లో అతన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచనున్నారు.
ఈ నెల 10న సాదుద్దీన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ అనంతరం పోలీసులు మైనర్లను జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు తరించగా.. సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్నారు. కస్టడీలో సాదుద్దీన్ వివరాల ఆధారంగా పోలీసులు మైనర్లను ప్రశ్నిస్తున్నారు.