హనుమకొండ : టీఆర్ఎస్కు కంచుకోటలా హుజూరాబాద్ నియోజకవర్గం తయారువుతోంది. ఉద్యమ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. టీఆర్ఎస్కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. కమలాపూర్ మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన ఒడ్డెర, ఆరె కులస్తులు, సంఘం నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంచార్జీ రవీందర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ కండువా కప్పుకున్నవారిలో పల్లపు వెంకన్న, సారంగం, శివరాత్రి తిరుపతి, కుమార్, పల్లపు సాంబయ్య, పైడి, రమేష్, కృష్ణమూర్తి, బక్కయ్య, భద్రయ్య, దినేష్, సంతోష్, సుమన్, గణేష్, హుస్సేనపల్లి సురేందర్, గురజాల రాజేశ్వర్ రావు, హుస్సేనపల్లి మల్లయ్య, దొంగల తిరుపతి, మర్రి రాజు, సంగీకారి శ్రీనివాస్, కొండం భిక్షపతి, ఉడుత కుమార్, కొప్పుల రాజయ్య, దొంగల రాజు, దొంగల కుమార్ తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్లోకి వచ్చిన వారికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి.