జనగామ : దేవరుప్పుల మండలం చిన్న మడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంపెల్లి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కార్యాలయంలో శ్రీనివాస్కు గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడినై కాంగ్రెస్ టీఆర్ఎస్లో చేరానని శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.