జోగులాంబ గద్వాల : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా గద్వాల నియోజ కవర్గంలోని కేటీ దొడ్డి మండలం ఉమ్మిత్యాల తండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమైఖ్య పాలనలో తండాలు కనీస అవసరాలు కూడా తీరక అనే ఇబ్బందులు పడేవారన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో తండాలకు మహర్దశ పట్టిందన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.