ఆర్మూర్(నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలానికి చెందిన పలువురు మంగళవారం బీఆర్ఎస్(BRS)లో చేరారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి(MLA Jeevan reddy) నాయకత్వంలో మాల కమిటీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాల మహనాడు కమిటీ మాక్లూర్ అధ్యక్షుడు దేగరి రవి, నీరడి గంగాధర్, శశి కుమార్, చింతల మోహన్, సక్కి ప్రభాకర్, వర్ణ బాస్ తదితరులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్లో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) పై ఉన్న విశ్వాసం తోనే అన్ని వర్గాల వారు బీఆర్ ఎస్ లో చేరుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా బీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు మాల మహనాడు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా వారు ‘దేశ్ కీ నేత కేసీఆర్, జైజీవనన్న, జై తెలంగాణ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల ఎంపీపీ మాస్త ప్రభాకర్,నరేందర్, అశోక్, నాగయ్య, శాంసన్, శ్రీనివాస్, మేకల అశోక్, మోహన్, నాగేశ్, వేణు, ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.