పెద్దపల్లి : సీఎం కేసీఆర్ చేపుడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్లో వివిధ పార్టీల నుంచి చేరుతున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. శనివారం ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన 50 మంది యువకులు జెడ్పీ చైర్మన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి పక్షాలకు రాష్ట్రంలో చోటు లేదన్నారు. సీఎం కేసీఆర్ వినూత్న పథకాలతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపారని కొనియాడారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. అందరూ కలిసికట్టుగా మూడోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయన వెంట ముత్తారం ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జెడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు పూర్తిపెద్ద కిషన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, కేషన్ పల్లి సర్పంచ్ నూనె కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ రమణా రెడ్డి, అమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.