యాదాద్రి భువనగిరి : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి (MLA Sunita Mahender Reddy ) అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామ కాంగ్రెస్ యూత్ నాయకులు వంద మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిం చిందన్నారు. వందల కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ మాయమాటలతో ఓట్లు అడుగుతుందని వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట బీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మల్లాపురం బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కర్రె బీరుమల్లయ్య, ప్రధాన కార్యదర్శి పిట్టల రాజు, యువజన విభాగం అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.