మెదక్ : వివిధ పార్టీల నాయకులు గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షించి బీఅర్ఎస్లో చేరడం అభిందనీయమని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హవేళీఘనపూర్, మెదక్ మండలంలోని నాగపూర్, తిమ్మనగర్, మక్తభూపతిపూర్ గ్రామాలకు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీనాయకులు, కార్యకర్తలు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీలోనే ప్రత్రి కార్యకర్తకు సరైన గౌరవం ఉంటుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను మరోసారి గెలిపించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ శ్రీహరి, వైస్ చైర్మన్ పురం శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, యం.అంజా గౌడ్, నాగపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాములు,మక్త భూపతిపూర్ సర్పంచ్ సుంకరి నర్సింలు, నాయకులు ఆనంద్, రాంచంద్రారెడ్డి, మ్యాకల సాయిలు, సాంబశివరావు, బాలయ్య, ఆంజనేయులు, సాప శ్రీనివాస్, షాకీర్, నర్సింలు, కిష్టయ్య, రవికుమార్, పోచయ్య బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.