సంగారెడ్డి, అక్టోబర్ 22 : అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల నాయకులు, యువకులు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
సోలక్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పోచయ్య, జీతయ్య, మల్లేశ్, లక్ష్మణ్, సత్తయ్య తదితరులు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పది సంవత్సరాలలోనే అభివృద్ధిలో దేశంలో తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో అనేక పథకాలతో అన్ని వర్గాలకు ఆర్థిక తోడ్పాటుకు చేయూతనిస్తున్నారని తెలిపారు.
యాభైసంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతికి అడ్రస్గా నిలిచిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని ఎన్నడు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ మాటలను పట్టించుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీటీసీ స్వాతిప్రభాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ రాములుయాదవ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి, సుధాకర్యాదవ్, చెక్కకృష్ణాగౌడ్, శాంతవర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.