కుమ్రంభీం ఆసిఫాబాద్ : బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బెజ్జూర్ మండలం కాటేపల్లి గ్రామానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(MLA Koneru Konappa) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బూటకపు హామీలతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటికలలు కంటున్నారని పేర్కొన్నారు. వారు అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆదరించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ బషరత్ ఖాన్, కారాం, తదితరులు పాల్గొన్నారు.