నల్లగొండ : బీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యకర్తలు క్రమశిక్షణ నిబద్దతతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy Lingaiah) సూచించారు. మంగళవారం నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు సుమారు 100 కుటుంబాలు ఎమ్మెల్యే మక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అక్షర్షితులై వివిధ పార్టీలకు నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామినిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో సూర రాములు, ఆలకుంట్ల ఇద్దయ్య, సూర మల్లయ్య, మాజీ వార్డ్ మెంబర్ సూర ఆంజనేయులు, రుద్రయ్య, ఆలకుంట లింగస్వామి ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొండూరు శంకర్, మేడి శంకర్, రేగట్టు నారాయణరెడ్డి, ఈటెల వెంకటేశ్వర్లు, బత్తుల అంజిరెడ్డి, బోయపల్లి నరసింహ గౌడ్, కల్లూరు శ్రీనివాస్, సూర ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.