నల్లగొండ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy) అన్నారు. గురువారం చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 100 కుటుంబాలు గుంటోజు యాదగిరి బీఆర్ఎస్ జిల్లా నాయకులు, ముద్దసాని రమణారెడ్డి ఆధ్వర్యంలోఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం,డంపింగ్ యార్డు, రైతువేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు.
ప్రతి పల్లెకు పక్కా రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడిసాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతుబంధు, రైతుబీమా వంటి చారిత్రాత్మక పథకాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో బత్తుల యాదయ్య, దొడ్డి వెంకన్న, ఓర్సు శంకర్, గుండబోయిన మహేష్, తోటకూర సైదులు, తెల్సురి లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చింతకింది తిరుమలయ్య, కార్యదర్శి తోటగిరి లింగస్వామి, చేకూరి బాబు రావు భవాని వార్డు సభ్యులు, తోటకురి లక్ష్మమ్మ వార్డు సభ్యులు, తెల్సురి లింగయ్య వార్డు సభ్యులు, సుగుణమ్మ వార్డు సభ్యులు, గుండెపురి చంద్రయ్య వార్డు సభ్యులు పాల్గొన్నారు.