నల్లగొండ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నకరేకల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumarthi ) అన్నారు. నకిరేకల్ పట్టణంలోని 1,2,3 వార్డులలోనీ 100 మంది యువకులు కాంగ్రెస్, బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రాజ్య సభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాత, కొత్త తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి నకరేకల్ గడ్డ నుంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీలో చేరిన వారిలో..ఏర్పుల హరికృష్ణ బీజేవైఎం అసెంబ్లీ కో కన్వీనర్, కోపల్లి భిక్షం రెడ్డి, జాల వెంకన్న బీజేపీ ఓబీసీ టౌన్ కౌన్వినర్, ఏశబోయిన పాండు, ఏశబోయిన సైదులు ఎఫ్సీఐ గోదాం కార్మిక నాయకులు, జాల ప్రవీణ్, జాల జైపాల్, భూపతి సాయి, వినయ్, ఏశబోయిన లింగస్వామి, దుర్గం బన్నీ, జక్కల గణేష్, ఏర్పుల దిలీప్ కుమార్, తండు రమేష్, దేవులపల్లి వెంకన్న, మేడిపల్లి సాయి, ఎస్కే ఫాయజ్, జహంగీర్, పొట్టబత్తుల సాయి, పవన్ కళ్యాణ్, దైద రామకృష్ణా రెడ్డి, వీరేందర్ రెడ్డి, చిట్టిప్రోలు శ్రీకాంత్, వనం నరేష్, రాపోలు ప్రకాష్, వజ్జ వీరయ్య, హరీష్, తదితరులు ఉన్నారు.