సూర్యాపేట : పనిచేసే వారికి అర్హతను బట్టి పదవులు లభిస్తాయి. బీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్తకు సరైన గౌరవం లభిస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ క్యాంపు కార్యాలయంలో మోతే మండలం సిరికొండ కూడలి గ్రామాలకు చెందిన 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గులాబీ కండువాలు కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు శక్తివంతం లేకుండా కృషి చేయాలన్నారు.
పార్టీలోని కొత్త,పాత అనే తేడా లేకుండా సమిష్టిగా పనిచేసే తమ గ్రామాలలో పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.