సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడుతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) విజయం ఖాయం అవడంతో, కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరెందుకు క్యూ కడుతున్నారు. దీంతో తమ క్యాడర్ను కాపాడుకోవడానికి ఆ పార్టీల అభ్యర్థులు నానా పాట్లు పడుతుంటే బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. తాజాగా జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి సమక్షంలో 28వ వార్డు కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఫిరోజ్ ఖాన్, మసాలా సైదులు నజీర్ చింతలపాటి శీను కప్పల సుమన్ నజీర్తో పాటు వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.