నల్లగొండ : దేశంలో సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం అన్నారు. బీఆర్ఎస్ కి మద్దతుగా నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి కొనసాగుతున్న వలసలే దీనికి నిదర్శనం అన్నారు. దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు.
జరుగుతున్న అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా భాగస్వామ్యం కావాలి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో సూర్యాపేట నియోజకవర్గంలోని పలువురు బిజెపి, కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు, నాయకులు మంత్రి సక్షమంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి అందరూ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.
అభివృద్ధిలో భాగస్వాములవుతున్న దళిత మోర్చా నేతలకు మంత్రి అభినందనలు తెలిపారు. సంక్షేమానికి జై కొట్టిన ప్రతిపక్ష నేతలు సూర్యాపేట నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ బేజారవుతున్నాయని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఉంటుందన్నారు.