కరీంనగర్ : గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని..బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఢిల్లీ పాలకులు వద్దని..కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్దుంపూర్, చర్ల బుత్కుర్కు చెందిన యువకులు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆనాడు సమైక్య పాలనలో పక్కనే గోదావరి పారినా..మన పొలాల్లోకి చుక్కా నీరు రాని పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేయాలంటే ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితులు ఉండేవనినీ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పోరాడి తెలంగాణను సాధించి ఎంతో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
అన్నారు. సాగు పెట్టుబడి కోసం రైతుబంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని, రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో పండిన ప్రతి గింజను కొనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. మనం పడిన కష్టం భవిష్యత్ తరాలు పడొద్దంటే కేసీఆర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, రూరల్ అధ్యక్షుడు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, బండారి వేణు, తదితరులు పాల్గొన్నారు.