జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తొర్రూర్ మండలం, పత్తేపురం గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన 3వ వార్డు మెంబర్ కాసారబోయిన మౌనిక, మాజీ వార్డ్ మెంబర్ పూజారి రాజ్ కుమార్, కాసరబోయిన సూరి బాబు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే గోపాలగిరి గ్రామానికి చెందిన డి.సందీప్ అధ్వర్యంలో 20 మంది, కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు గాజుల సుజాత, కొడకండ్ల మండలం చెరువు ముందు తండా గ్రామానికి చెందిన యువకులు తదితరులు పార్టీలో చేరు. వారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli)గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే దేవరుప్పుల మండలం, రామచంద్రపురం గ్రామానికి చెందిన దోనికెల సోమయ్య, ఉపేంద్ర, ఉడుగుల భాస్కర్, లక్ష్మి, రామక్క తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
అలాగే పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు జీడి హరీష్, దేవరుప్పుల మండలం, రామోజీ గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మేడ నర్సయ్య మేడ ఎలేందర్, లకావత్ తండా గ్రామానికి చెందిన అజ్మీర భూక్య, అజ్మీర సుమన్, సీతతండా గ్రామానికి చెందిన రాజశేఖర్, ప్రకాష్, వెంకన్న, దేవుని గుట్ట తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ధారావత్ పాత్తి, భీమా, కిషన్, యాదగిరి, బిచ్య, యాదగిరి తదితరులు BRS పార్టీలో చేరారు.