నిజామాబాద్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మెండోర మండలం కొడిచెర్ల గ్రామ బీజేపీ పార్టీకి చెందిన యువకులు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు సరితూగే రాష్ట్రం లేదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటులేదని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో యోగేష్, శశికిరణ్, సాయరెడ్డి, రాజు, సన్నిత్, నవీన్, రాజేష్ తదితరులు ఉన్నారు.