ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంగా మూడేండ్ల కింద చేరిన. మొదట్ల రూ.16,500 జీతం వచ్చేది. మా ఆయన వ్యవసాయం చేస్తడు. నాకు బైక్ లేకుండె. బస్సులల్ల పీహెచ్సీకి, సబ్సెంటర్కు పోయిరావాల్నంటే కష్టం అయితుండె. వ్యాక్సిన్లు, మందులు, రికార్డులు మోయడం కష్టమయ్యేది. బస్సుల పోవాలె కాబట్టి దవాఖానకు ముందే బయలుదేరాల్సి వస్తుండె. ఇంటికొచ్చేసరికి ఆలస్యమయ్యేది. ఎంత కష్టమైనా జాబ్ వదులుకోవద్దనుకున్నా. సీఎం కేసీఆర్ మా జీతాలను పెంచిండు. ఇప్పుడు నెలకు రూ.27 వేలు వస్తున్నయి. రెండు నెలలకే యాక్టివా కొనుక్కున్న. ఇప్పుడు టైమ్కు డ్యూటీకి పోతున్న. టైమ్కు ఇంటికి వస్తున్న.
– జంగిటి మమత,ఏఎన్ఎం, రామక్కపేట, సిద్దిపేట