నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గంలోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన రజక సంఘం అధ్యక్షుడు గోలి బిక్షమయ్య ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రాల్లో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒక్క తెలంగాణలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అమలు అవుతున్నాయని అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ , రజకులు కులదైవం మడివాల దేవాలయం నిర్మాణానికి తనవంతు సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్థులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు .
కబడ్డీ క్రీడాకారులకు అభినందన
మధ్యప్రదేశ్లోని భోపాల్ జరిగిన కబడ్డీ పోటీలో ద్వితీయ స్థానం సాధించిన నార్కట్ పల్లి క్రీడాకారులను ఎమ్మెల్యే చిరుమర్తి అభినందించారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను క్రీడాకారులు మర్యాద పూర్వకంగా కలిశారు.