తుంగతుర్తి : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. పార్టీలో చేరిన కుటుంబాలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, స్థానిక సర్పంచ్ నకరికంటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.