అలంపూర్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం జోగుళాంబ దేవిని చంద్రఘంటాదేవిగా అలంకరించారు. పసిడి వెలుగులు వెదజల్లుతూ చంద్ర రేఖలను శిరస్సులో ధరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.