జోగులాంబ గద్వాల : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జోగుళాంబ ఆలయంలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వసంత పంచమి 6వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.
చివరి రోజు అమ్మ వారి నిజ రూప దర్శనం ఉంటుంది. ఈ వేడుకలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సావాలు కొనసాగుతున్నట్టు ఆలయ ఈవో పురేందర్ కుమార్ తెలిపారు.