ఆదిలాబాద్ : అదిలాబాద్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్(CM KCR) వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఐటీ టవర్, జేఎన్టీయూ, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ, సబ్స్టేషన్లు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టారని ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జోగు రామన్న(Jogu Ramanna) అన్నారు. గురువారం ఆదిలాబాద్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ను విద్యా క్షేత్రంగా మార్చిందన్నారు.
అలాగే ఫార్మసీ, పీజీ కాలేజీ కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పత్తి ఎక్కువగా పండుతున్న నేపథ్యంలో ఇక్కడ టెక్స్టైల్స్ పార్క్ నిర్మిస్తే ఇక్కడి నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఆదివాసీలు, గిరిజనులు పోడు పట్టాలు ఇచ్చి ఆదుకున్నారు. అయితే కొంతమంది మిగిలిపో యారని వారికి కూడా పోడు పట్టాలు ఇవ్వాలన్నారు. మరిన్ని అభివృద్ధి పనులు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.