కాకతీయ విశ్వవిద్యాలయ కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన 31 మంది విద్యార్థులు వరంగల్ నగరంలోని సాఫ్ట్పాత్ సిస్టం సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా కేయూ వీసీ రమేశ్ విద్యార్థులకు నియామక పత్రాలను అందజేసి, వారిని అభినందించారు. సెప్టెంబర్ 28న నిర్వహించిన ప్రాంగణ నియామకాల ప్రక్రియలో భాగంగా ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ నుంచి 23 మంది, సుబేదారి పీజీ కళాశాల నుంచి 8 మంది ఎంపికైనట్టు వీసీ పేర్కొన్నారు.
– నయీంనగర్