హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాల పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. పెట్టుబడుల వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఆదివారం కూకట్పల్లి డివిజన్ వెంగళరావు నగర్ కమ్యూనిటీ హాల్లో యువతతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఐటీ, పారిశ్రామిక రంగాలు పరుగులు తీస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కారణంగా ప్రపంచస్థాయి సంస్థలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. దేశానికి యువత వెన్నముకలాంటి వారని, వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.
యువత సన్మార్గంలో నడిచి రాష్ర్టానికి, దేశానికి సేవలందించాలని సూచించారు. కులం మతం పేరుతో పబ్బంగడిపే రాజకీయ పార్టీల నేతల ఉచ్చులో పడొద్దని, బంగారు భవిష్యత్ను పాడు చేసుకోవద్దని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువతనేత చైతన్య యాదవ్, సంతోష్ యాదవ్, మహేశ్, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి ప్రభాకర్ తదితరులున్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
బాలానగర్ డివిజన్ ఇందిరానగర్ కాలనీకి చెందిన స్టార్ యూత్ అసోయేషన్ సభ్యులు వందమంది బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, బీఆర్ఎస్ను బలోపేతం చేయాలని కోరారు.