హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అన్ని ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో నిర్వహించాలని జేఎన్టీయూ హైదరాబాద్ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులు, అధ్యాపకుల కు కవితా పోటీలు, వ్యాసరచన పోటీలు తదితర కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి / షాదీముబాకర్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్స్, దళితబంధు, కంటి వెలుగు, ఆసరా పెన్షన్లు తదితర అంశాలపై తెలుగు / ఇంగ్లిష్ మీడియంలో కవిత పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది.
ఈ సందర్భంగా కాలేజీలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. పోటీల నిర్వహణకు ఈ నెల 17 వరకు గడువు విధించింది. ఈ నెల 19న వ్యాస రచన పోటీ ఫలితాలు విడుదల చేస్తామని, 20వ తేదీన కవితల పోటీల్లో పాల్గొన్న వారికి జేఎన్టీయూ ఆడిటోరియంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.