హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెలఖారు వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. యూజీ, పీజీ కోర్సుల(బీటెక్, బీఫార్మసీ) (ఎంటెక్, ఎంఫార్మసీ) విద్యార్థులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్ డీ, ఫార్మ్ డీ(పీబీ) విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులో నిర్వహించనున్నారు. ఇతర వివరాల కోసం జేఎన్టీయూ వెబ్సైట్ను సందర్శించొచ్చు.