ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారానికి చెక్
పట్టణాల్లో 17 లక్షల ఆస్తుల ట్యాగింగ్ పూర్తి
రీ అసెస్మెంట్తో 33 కోట్ల అదనపు ఆదాయం
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో అమలు చేస్తున్న ఆస్తుల జియో ట్యాగింగ్ విధానం సత్ఫలితాలను ఇస్తున్నది. ఆస్తి పన్నుపై పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతున్నది. తప్పుడు వివరాలు, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చే వారికి చెక్ పడుతున్నది. తద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం సైతం పెరుగుతుంది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఆస్తులకు జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ప్రతి ఆస్తిని జియో ట్యాగింగ్ చేస్తున్నారు. పట్టణాల్లో 20.54 లక్షల ఆస్తులు ఉండగా.. వీటిలో 17.62 లక్షల (86 శాతం) ఆస్తులకు జియో ట్యాగింగ్ పూర్తిచేశారు. వీటిల్లో 1.39 లక్షల ఆస్తులను రీ అసెస్మెంట్ చేశారు.
వీటి లెక్కల్లో భారీ తేడాలను గుర్తించారు. రూ.33.10 కోట్లు ఆదనంగా మున్సిపల్శాఖకు ఆదాయం వచ్చింది. రాబో యే రోజుల్లో రీ అసెస్మెంట్ ఇంకా ఎక్కువ సంఖ్యలో చేయనున్నారు. జియో ట్యాగింగ్లో ప్రతి ఆస్తి దగ్గరికి వెళ్లి ఆ ఇంటిని ఫొటో తీస్తారు. అనుమతుల వివరాలను నమోదు చేస్తారు. తద్వారా ఇప్పటివరకు వారు చెల్లించే పన్ను వివరాలపై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమైతే రీ అసెస్మెంట్ చేస్తారు. కొత్త ఇండ్లకు జియో ట్యాగింగ్ ద్వారా పన్ను విధిస్తున్నారు. ఈ విధానంలో ఇప్పటివరకు 5,312 ఆస్తులను నమోదు చేయగా.. రూ.5.16 కోట్ల ఆదాయం వచ్చింది.