హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ కోరారు.
ఈ మేరకు శనివారం ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు. కరెన్సీపై ఫొటో ముద్రించాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ సలహాదారులు ఆళ్ల రామకృష్ణ, వీరన్ తదితరులు ఉన్నారు.