హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2 పరీక్షల ఫలితాలను ఈ నెల 25న విడుదల చేస్తారు. బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 12.57 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు.
జేఈఈ మెయిన్-2 పేపర్-1 పరీక్షలు మంగళవారంతో ముగియగా, ఈ నెల 12న పేపర్-2 (ఏ), పేపర్ 2(బీ) పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత రెస్సాన్స్ షీట్లు, ప్రాథమిక కీలను విడుదలచేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు.